సాయి ధరమ్,వరుణ్ తేజ్ లతో మల్టీ స్టారర్ చేస్తా – వైష్ణవ్ తేజ్

-

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే చక్కటి విజయాన్ని అందుకున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫిల్మ్ లో వైష్ణవ్ తేజ్ పర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత విడుదలైన ‘కొండ పొలం’ మూవీకి మంచి టాక్ వచ్చింది. కానీ, బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు.ఈ క్రమంలోనే పంజా వైష్ణవ్ తేజ్ మూడో చిత్రం కొత్త దర్శకుడు గిరీశయ్యతో చేస్తుండగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.

ఢిల్లీ భామ కేతిక ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా, డిఫరెంట్ లవ్ స్టోరిగా ఈ సినిమా ఉండబోతున్నదని తెలుస్తోంది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్ పీ బ్యానర్ పై బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ పిక్చర్ ను ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే.. ఈ ప్రమోషన్స్‌ నేపథ్యంలో తాజాగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వైష్ణవ్.. తన మనసులో మాట బయటపెట్టారు. తనకు మెగా ఫోన్ పట్టాలనే కోరిక ఉందని, మెగా హీరోలైన ఇద్దరితో సినిమా చేయాలని అనుకుంటున్నానంటూ ఓపెన్ అయ్యాడు.

ఇప్పటికే ఓ కథ కూడా సిద్ధం చేసుకున్నానని, ఆ కథను మల్టీస్టారర్ సినిమాగా.. అన్నయ్య సాయి ధరమ్ తేజ్‌.. బావ వరుణ్ తేజ్‌లతో చేయాలని భావిస్తున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం హీరోగా బిజీగా ఉన్నా కానీ.. సమయం వచ్చినపుడు ఖచ్చితంగా మెగా ఫోన్ పడతానని చెప్పుకొచ్చాడు. దాంతో ఈ మల్టీ స్టారర్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇకపోతే.. రంగ రంగ వైభవంగా సినిమా పై మంచి హైప్ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. మరి వైష్ణవ్.. ఈ క్రేజీ మల్టీస్టారర్‌ను ఎప్పుడు తెరపైకి తెస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news