తొలిరోజు ‘వందే భారత్’ ఎక్స్‌ప్రెస్ ఆగనున్న స్టేషన్లు ఇవే

-

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆదివారం ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకగా అందిస్తున్న ఈ రైలును దిల్లీ నుంచి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రారంభం రోజు వందే భారత్‌ రైలు ప్రత్యేక వేళల్లో నడవనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అదే విధంగా మొదటి రోజున వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ఏయే స్టేషన్లలో ఆగనుందో.. ఆ వివరాలు కూడా వెల్లడించింది.

ఆదివారం ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరిన వందే భారత్‌ రైలు చర్లపల్లి, భువనగిరి, జనగామ, ఖాజీపేట్‌, వరంగల్‌, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుందని తెలిపారు. అదే రోజు రాత్రి 8.45 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news