గజ్వేల్ లో ఈటల కాదు.. మోడీ వచ్చినా ఓటమి తప్పదు – వంటేరు ప్రతాప్ రెడ్డి

-

గజ్వేల్ లో నువ్వు కాదు.. మోడీ అమిత్ షా ఓటమి తప్పదని.. మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు కౌంటర్ ఇచ్చారు వంటేరు ప్రతాపరెడ్డి. గజ్వేల్ లోని సిఎం క్యాంప్ కార్యాలయంలో FDC ఛైర్మెన్ ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా వంటేరు ప్రతాప రెడ్డి మాట్లాడుతూ… ఈటెల రాజేందర్ గజ్వేల్ లో కాదు మరో సారి హుజూరాబాద్ లో గెలిచి నీ ఉనికిని చాటుకో అని ఛాలెంజ్ చేశారు. గజ్వేల్ లో నీవు కాదు ప్రధాని నరేంద్ర మోడీ, మీ నాయకుడు అమిత్ షా, నడ్డ,వచ్చిన వారికి ఇక్కడ ఓటమి తప్పదని సవాల్ విసిరారు. గజ్వెల్ లో టీఆర్ఎస్ కండువా వేసుకున్న ఒక సామాన్య కార్యకర్తను కూడా ఈటెల రాజేందర్ ఓడించలేడన్నారు వంటేరు ప్రతాపరెడ్డి.

ఆస్తులను కాపాడు కొనేందుకు బిజెపి కండువా వేసుకున్నావు..నీ నియోజకవర్గానికి కేంద్రం నుండి తీసుకొచ్చిన నిధుల వివరాలు చెప్పగలవా ? అని నిలదీశారు ప్రతాపరెడ్డి. నీ నియోజకవర్గంలో మొత్తం కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు…హుజూరబాద్ లో నీకు ఓటమి భయం పట్టుకొని గజ్వేల్ లో పోటీ చేస్తా అని ప్రకటనలు చేస్తున్నావని సెటైర్లు పేల్చారు.

Read more RELATED
Recommended to you

Latest news