గ్లామర్ పాత్రలకు సరిపోననే విలన్ పాత్రలు ఎంచుకున్నా.. వరలక్ష్మి శరత్ కుమార్..

-

తమిళ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పటికే తెలుగుతోపాటు పలు భాషల్లో నటించింది తాజాగా సమంత ప్రధాన పాత్రలో వచ్చిన యశోద చిత్రంలో సైతం కీలక పాత్ర పోషించింది అయితే ప్రస్తుతం మాస్ డైరెక్టర్ గోపీచంద్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి చిత్రంలో ఈమె నటించిన సంగతి తెలిసిందే.. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతుంది.. అయితే ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది వరలక్ష్మి శరత్ కుమార్…

వరలక్ష్మి శరత్ కుమార్.. విలన్ పాత్రలతో తనకంటూ మంచి పేరు సంపాదించుకుంది ముఖ్యంగా ఏ విషయాన్ని అయినా ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా మాట్లాడుతుంది ఈమె.. సినిమాల్లో సైతం అదే టాలెంటును చూపిస్తుంది.. తెలుగులో ఇప్పటికే పలు చిత్రాల్లో నటించింది.. మాస్ మహారాజా రవితేజ నటించిన క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. అయితే తమిళంలో పోడా పొడి సినిమాతో కథానాయక గా పరిచయమైంది ఈ భామ.. ఆ తర్వాత మాత్రం విలన్ పాత్రలను ఎంచుకుంది.. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈమె హీరోయిన్గా నటించకుండా విలన్ పాత్రలు ఎంచుకోవడానికి అసలు కారణం చెప్పుకొచ్చింది..

“సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నేను హీరోయిన్ గానే చేయాలి అనుకున్నాను.. గ్లామర్ పాత్రలో చేయాల్సి వచ్చినప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది.. ఆ తర్వాత ఇది నాకు వర్కౌట్ కాదని భావించా.. ఇప్పటికే ఇండస్ట్రీలో గ్లామర్ పాత్రలు చేయడానికి ఎందరో ఉన్నారని.. ఏదైనా ప్రత్యేకంగా చేయాలనిపించి ప్రతినాయక పాత్రలను ఎంచుకున్నాను..” అంటూ చెప్పకు వచ్చింది.. అలాగే ఈ పాత్రలతోనే తనకు మంచి పేరు వస్తుందని తెలిపింది.. ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ బలి చిత్రాల్లో నటిస్తుంది వాటిలో ముఖ్యంగా తొందరలోనే విడుదల పోతున్న వీరసింహారెడ్డి చిత్రంతో పాటు.. పంపన్, నద్నల్ పరాశక్తి, కలర్స్, లగం, శబరి చిత్రాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news