ఆ రూమర్లపై క్లారిటీ ఇచ్చేసిన సాయి పల్లవి..

-

లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి తన అందంతో అభిమానుల్ని ఎంతగా ఫిదా చేస్తుందో అందరికీ తెలిసిందే.. ఫిదా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ భామ ఇప్పటివరకు ఎన్నో హిట్ చిత్రాల్లో నటిస్తూ వస్తుంది.. సినిమా హిట్ అయినా కాకపోయినా సాయి పల్లవి నటనకు మాత్రం పూర్తి స్థాయి లో మార్కులు పడాల్సిందే.. ముఖ్యంగా ఆమె తన ఎక్స్ప్రెషన్స్, డాన్స్ తో అభిమానుల్ని కట్టిపడేస్తుందనే చెప్పాలి.. ఈమెకు ఇప్పటికే ఎందరో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా సాయి పల్లవి సినిమాలు కు దూరం అయిపోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయంపై స్పందించిన ఈ హీరోయిన్ తాజాగా క్లారిటీ ఇచ్చేసింది..

తన అందంతో, వ్యక్తిత్వంతో, డాన్స్ తో ఇప్పటికే ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్న అందాల నటి సాయి పల్లవి.. ఈమె ప్రతి సినిమాకి తనని తాను ఎంతగానో మెరుగుపరుచుకుంటూ మరింత ప్రేక్షక ఆదరణ పొందుతూ వస్తుంది.. అయితే ఈ సమయంలో తాజాగా సాయి పల్లవి పై కొన్ని రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. ఈమె ఇప్పటికే డాక్టర్ వృత్తిని అభ్యసించిన సంగతి తెలిసిందే.. అయితే తాజాగా సాయి పల్లవి సినిమాలను వదిలిపెట్టనుందని డాక్టర్గా స్థిరపడటానికి ఈ నిర్ణయం తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి..

ఈ విషయంపై స్పందించిన సాయి పల్లవి.. “ప్రేమమ్‌ సినిమాతో నా సినీప్రయాణం మొదలైంది. ఆ సినిమా అంత పెద్ద విజయం సాధిస్తుందని నేను ఊహించలేదు. ఆ చిత్రంలో నేను చేసిన పాత్రకు ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అయ్యారు. నా పేరు చెప్పగానే గుర్తొచ్చే పాత్రల్లో అది ఒకటి. నేను ఎంబీబీఎస్‌ చదివినా.. నటిని కావాలనుకున్నాను. నా నిర్ణయానికి మా తల్లిదండ్రులు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. నేను నటించిన సినిమాలు ప్రేక్షకులకు నచ్చాలని అనుకుంటాను. నా పాత్రలు వాళ్లకి ఎప్పటికీ గుర్తుండాలని భావిస్తాను. నన్ను అందరూ తమ ఇంటి ఆడపడుచుగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. మంచి కథలు ఉంటే ఏ భాషలో అయినా నటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.. అలాగే సినిమాలో వదిలిపెట్టాలి అనే ఆలోచన ఇప్పట్లో లేదు కొన్నాళ్లు అనుకున్న విధంగా సినిమాల్లో కొనసాగి ఆ తర్వాత మాత్రమే వైద్యవృత్తిని ఎంచుకుంటాను.. ” అంటూ చెప్పకు వచ్చారు సాయి పల్లవి..

Read more RELATED
Recommended to you

Latest news