BREAKING : నటి వరలక్ష్మికి కరోనా పాజిటివ్‌.. ఆస్పత్రిలో చేరిక

-

క్రాక్‌ విలన్‌ వరలక్ష్మి శరత్‌ కుమార్‌ కు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. గత రెండు రోజుల నుంచి తీవ్ర అస్వస్థతకు గురైన వరలక్ష్మి శరత్‌ కుమార్‌… నిన్న రాత్రి కరోనా పరీక్షలు చేయించుకున్నారు అయితే.. ఈ పరీక్షల్లో… కరోనా పాజిటివ్‌ గా నిర్థారణ అయింది.

అయితే.. ఆమె ఊపిరి తీసుకోవడం కాస్త ఇబ్బందిగా మారడంతో… హైదరాబాద్‌ లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ను చేర్పించారు ఆమె కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఆమె పరిస్థితి కాస్త ఆందోలన కరంగా ఉందని సమాచారం అందుతోంది.

హీరో రవితేజ, గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన.. క్రాక్‌ సినిమా లో జయమ్మ అనే గెటప్‌ లో వరలక్ష్మి శరత్‌ కుమార్‌.. కనిపించి… అందరినీ అలరించింది. ఆ సినిమాతో టాలీవుడ్‌ లో వరుస సినిమాల్లో చాన్స్‌ కొట్టేసింది వరలక్ష్మి శరత్‌ కుమార్‌. కాగా.. తాజాగా బాలయ్య నెక్ట్స్‌ సినిమా NBK 107 లో కూడా ఛాన్స్‌ కొట్టేసింది వరలక్ష్మి శరత్‌ కుమార్‌.

Read more RELATED
Recommended to you

Latest news