వాస్తు: మీ ఇంట్లో లక్షీదేవి ఉండాలంటే ఈ తప్పులు చెయ్యద్దు..!

-

చాలా మంది ఇళ్లల్లో ధన నష్టం కలగడం, ఆర్థిక సమస్యలు రావడం, అప్పులు తిరిగి చెల్లించక పోవడం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఈ సమస్యలు బారిన పడకుండా ఉండాలంటే వాస్తు చిట్కాలని అనుసరించాలని పండితులు అంటున్నారు. వీటిని కనుక మీరు ఫాలో అయితే కచ్చితంగా అటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి అవుతుంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు పండితులు చెబుతున్న అద్భుతమైన చిట్కాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. మనం ఇంట్లో ఎన్నో రకాల సామాన్లని ఉపయోగిస్తుంటాం. వంట చేసుకోవడానికి వివిధ రకాల పదార్థాలను కూడా వాడుతూ ఉంటాం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇవి కనుక అయిపోతే దీని వల్ల ఇబ్బందులు వస్తాయి.

పిండి:

ఇంట్లో ఎప్పుడూ కూడా పిండి అయిపోవడం జరగకూడదు అని పండితులు చెప్తున్నారు. పిండి మొత్తం అయిపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి. ధన నష్టం వంటి ఇబ్బందులు కలుగుతాయి.

పసుపు:

ఇంట్లో పసుపు అయిపోవడం కూడా మంచిది కాదు. పసుపు అయిపోయిందంటే గురు దోషం కలుగుతుంది. ఆనందం కూడా ఉండదు. అలానే ధననష్టం వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఎప్పుడూ పసుపు అయిపోయే వరకు తెచ్చుకోకుండా ఉండద్దు.

ఉప్పు:

ఉప్పు కూడా ఎప్పుడూ పూర్తిగా అయిపోకూడదు. ఉప్పు అయిపోయిందంటే ఆర్థిక సమస్యలు వస్తాయి అందుకని దీన్ని కూడా ముందుగా చూసుకోవాలి.

బియ్యం:

బియ్యం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి ఇంట్లో కనుక బియ్యం అయిపోయిందంటే ధన నష్టం ఆర్థిక సమస్యలు కలుగుతాయి. కాబట్టి ఎప్పుడూ ఇంట్లో ఇవి అయిపోకుండా చూసుకోండి లేదంటే ఇబ్బందులు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news