ఏపీలో రోడ్లు చాలా ఆధ్వానంగా ఉన్నాయి – తెలంగాణ మంత్రి

-

ఏపీ సర్కార్‌ పై మరోసారి తెలంగాణ రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయని ఆ రాష్ట్ర ప్రజలు చెప్పుకుంటున్నారని తెలంగాణ రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. అందుకే ఏపీలో BRS కావాలని చాలామంది విజ్ఞప్తి చేస్తున్నారన్నారు.

ఖమ్మం జిల్లా పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాల్లో రూ. 100 కోట్ల అభివృద్ధి పనులను శుక్రవారం ప్రారంభించారు. పాలేరు నియోజకవర్గంలోని రామన్నపేట, సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ మండలం మల్లవరంలో నిర్వహించిన సభల్లో మంత్రి మాట్లాడారు. ఉమ్మడి ఏపీలో రహదారుల అభివృద్ధికి రూ. 20వేల కోట్లు విచ్చిస్తే, తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇక్కడి రోడ్లకు అదే స్థాయిలో ఖర్చు చేసినా ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు. బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news