ఇలాంటి వార్త వినాల్సి రావడం విచారకరం: వెంకయ్యనాయుడు

-

నందమూరి తారకరత్న మరణంతో టాలీవుడ్​లో విషాదం నెలకొంది. సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తారక్ మరణం పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తారకరత్న మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

‘‘ప్రముఖ నటుడు శ్రీ నందమూరి తారకరత్న పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. ఆయన గుండెపోటుకు గురైన నాటి నుంచి ఎప్పటికప్పుడు తన ఆరోగ్యపరిస్థితి గురించి వాకబు చేస్తున్నాను. సంపూర్ణ ఆరోగ్యంతో మనందరి మధ్యకు తిరిగి వస్తారని భావించాను. ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి రావడం విచారకరం. చిన్న వయసులో తారకరత్న పరమపదించటం వారి కుటుంబానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ -మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు

మరోవైపు తారక్ మరణం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంతాపం ప్రకటించారు. ‘‘సినీనటుడు, తెదేపా నాయకుడు నందమూరి తారకరత్న మరణం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని భగవంతుడుని ప్రార్థిస్తున్నా. తారకరత్న కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news