వెరీ బ్యాడ్: 3 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయిన ఒమర్ జై !

-

వరల్డ్ కప్ లో ఈ రోజు ఆఫ్గనిస్తాన్ మరియు సౌత్ ఆఫ్రికా ల మధ్యన జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న షాహిద్ సేన నిర్ణీత ఓవర్ లలో సరిగ్గా ఆల్ అవుట్ అయ్యి 244 పరుగులు మాత్రమే చేయగలిగింది. కానీ సౌత్ ఆఫ్రికా లాంటి బౌలింగ్ ను ఎదుర్కొని ఇన్ని పరుగులు చేయడం నిజంగా గొప్పే అంటున్నారు క్రీడాపండితులు. కాగా ఈ మ్యాచ్ లో ఆల్ రౌండర్ అజ్మతుల్లా ఒమర్ జై మూడు పరుగుల వ్యవధిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఆఖరి రెండు ఓవర్ లలో పది పరుగులు చేస్తే సెంచరీ అవుతుంది అనగా సింగిల్స్ తీసుకుంటూ బాల్స్ వృధా చేయడంతో చివరికి 97 పరుగుల వద్దనే నిలిచిపోయాడు. ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా పై సెంచరీ చేసి ఉంటే వేరే లెవెల్ లో ఉండేది.

కానీ ఇతనికి ఆ అదృష్టం దక్కలేదు. కానీ జట్టు ఇంత స్కోర్ చేసిందంటే కారణం ఒమర్ జై అని చెప్పాలి. ఇప్పుడు సౌత్ ఆఫ్రిక ముందున్న ఈ లక్ష్యాన్ని త్వరత్వరగా చేధించేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news