మునుగోడులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్ధంపై విహెచ్ కామెంట్స్

-

మునుగోడు నియోజక వర్గంలోని చండూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని దగ్ధం చేశారు దుండగులు.. ఈ రోజు చండూర్ మండలం లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ప్రచారం ఉన్న నేపథ్యంలో రాజకీయ కక్షలతో పార్టీ కార్యాలయం, ప్రచార సామగ్రిని దగ్ధం చేశారు దుండగులు. అయితే.. ఈ చర్యలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ దిమ్మెలు కూల్చినా, పార్టీ కార్యాలయాలు తగులబెటినా.. మునుగోడు గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని ఆయన స్పష్టం చేశారు. తాజాగా ఈ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు స్పందించారు. ఈ ఘటనను ఉపేక్షించరాదని, ఇవాళ ఈ ఘటన జరిగింది, రేపు మరొకటి జరుగుతుందన్నారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని కూడా వదిలేసి తాడోపేడో తేల్చుకోవడానికి కూర్చున్నారని వెల్లడించారు. ఈ ఘటనను తేలికగా వదిలేస్తే రేపు తమ కార్యకర్తలను చంపేసిన అడిగే వారెవ్వరు? అని వీహెచ్ వ్యాఖ్యానించారు.ఈ ఘటనపై ప్రభుత్వం, ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news