రాజీనామాకు దమ్ముందా.. అంటూ వైసీపీ ఎమ్మెల్యే రజిని చాలెంజ్

-

చిలకలూరు పేట నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే విడదల రజిని ఏపీకి మూడు రాజధానుల అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి ప్రాంత రైతుల ఆందోళనలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని ఆమె దుయ్యబట్టారు. మూడు రాజధానులు ఉండొచ్చని సీఎం ప్రకటన మాత్రమే చేశారని.. ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆమె స్పష్టం చేశారు. రాజధాని అమరావతిని తరలిస్తారని ఎవ్వరూ చెప్పలేదని గుర్తు చేశారు. అమరావతిలో టీడీపీ నేతలు ఆస్తులు కొనుగోలు చేశారని.. వాటి ధరలు పడిపోతాయన్నదే తెలుగుదేశం నేతల భయమని ఎమ్మెల్యే రజిని అన్నారు.

రాజధాని అమరావతి కోసం గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని టీడీపీ చేసిన డిమాండ్‌పై రజిని ఘాటుగా స్పందించారు. టీడీపీ నేతలు రాజధాని అమరావతికి కట్టుబడి ఉంటే.. ముందు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్నారు. రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లాలని ఆమె చాలెంజ్ విసిరారు. మ‌రి దీనిపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news