జబర్దస్త్ కమెడియన్ తో డ్యాన్స్ వేస్తున్న కుష్బూ వీడియో వైరల్..!!

-

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కమెడియన్గా బుల్లెట్ భాస్కర్ తన కామెడీ పంచులతో ప్రతి ఒక్కరిని అలరిస్తూ ఉంటారు. ఇక ఈ షో కి జడ్జిగా కృష్ణ భగవాన్ ,కుష్బూ రావడం జరిగింది. ఇక గతంలో కూడా నాగబాబు,రోజా, సింగర్ మనో, ఇంద్రజ తదితరులు ఉండడం జరిగింది. ఇక నవంబర్ 25వ తేదీన ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ కు సంబంధించి ఒక ప్రోమో తాజాగా రిలీజ్ చేయడం జరిగింది మేకర్స్. ఈ ప్రోమోలో బుల్లెట్ భాస్కర్ తో కలిసి అలనాటి హీరోయిన్ కుష్బూ సింప్లి స్టెప్పులతో అదరగొడుతోంది. అందుకు సంబంధించి ఒక వీడియో కూడా వైరల్ గా మారుతోంది.

1980 సంవత్సరం నుంచి దాదాపుగా 12 సంవత్సరాల వరకు తన హవా కొనసాగించింది హీరోయిన్ కుష్బూ. దీంతో ఈమె నటనకు ఫిదా అయినా అభిమానులు ఏకంగా కోలీవుడ్ లో ఒక గుడి ని కట్టించారు. అయితే వయసు పెరుగుతున్న తరుణంలో ఈమెకు అక్క , తల్లి పాత్రలలో వేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్ షో కి జడ్జిగా కూడా ఎంట్రీ ఇచ్చింది. తాజాగ ఎక్స్ట్రా జబర్దస్త్ కి సంబంధించి ఒక ప్రోమో వైరల్ గా మారుతోంది. ఈ ప్రోమో కూడా ఫుల్ లెన్త్ పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తోంది.

ఈ ప్రోమోకు హైలైట్ గా కుష్బూ బుల్లెట్ భాస్కర్ ల డ్యాన్స్ అనే చెప్పవచ్చు. కాంచన చిత్రంలోని నలుపు నేరేడు అంటి కళ్ళే అనే పాటకు ఇద్దరు కలిసి చాలా సింపుల్ స్టెప్పులు వేసి అందరిని ఆకట్టుకున్నారు. హీరోయిన్ కుష్బూ మాత్రం ఎప్పటిలాగే తన గ్రేస్ అని తగ్గకుండా చూసుకుంది. అలా వీరిద్దరూ డ్యాన్స్ వేస్తూ ఉంటే జబర్దస్త్ స్టేజ్ మొత్తం రచ్చ రచ్చగా మారిపోయింది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news