అమ్మను చంపిన అతివిశ్వాసం.. తల్లిని ఎలా చంపేసాడో చూడండి…!

-

బయటకి వెళ్ళకు నాన్నా… కరోనా వైరస్ ఉంది. అనవసరంగా సమస్యలు తెచ్చుకోవాలి. నాకు ఏమీ కాదమ్మా… నాకు రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ. నేను చాలా బలంగా ఉన్నాను. వినకుండా బయటకు వెళ్ళాడు ఒక కొడుకు… ఇంట్లోకి వచ్చాడు బయట అంతా తిరిగి. పిల్లితోనో కుక్క పిల్లతోనో కాసేపు ఆడుకున్నాడు. ఆ తర్వాత ఫ్రిడ్జ్ లో ఉంచిన మంచి నీళ్ళ బాటిల్ తీసుకుని తాగి దాన్ని వంట గదిలో పెట్టాడు.

కొడుకు రావడంతో బెడ్ రూమ్ లో నిద్ర పోతున్న తల్లి బయటకు వచ్చింది. కిచెన్ లో ఉన్న మంచి నీళ్ళ బాటిల్ ని తీసుకుని గ్లాస్ లో నీళ్ళు పోసుకుని తాగింది. ఆ తర్వాత ఇంట్లో ఎవరి దారిన వాళ్ళు వెళ్లి నిద్రపోయారు. ఒక రోజు తల్లికి అనారోగ్యం వచ్చింది. ఏమైందో తెలియదు, తల్లికి శ్వాస పీల్చుకోవడం చాలా కష్టం అయింది. వెంటనే తమ్ముడు వచ్చి లేపాడు. అన్నా అన్నా అమ్మ ఇబ్బంది పడుతుంది త్వరగా లేవరా అంటూ లేపాడు. అప్పటికే అమ్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దీనికి కారణం అతను తాగిన వాటర్ బాటిల్.

అమ్మ వద్దన్నా బయటకు వెళ్ళాడు. నా రోగ నిరోధక శక్తి ఎక్కువ అన్నాడు. పాపం ఇద్దరు బిడ్డలను కనీ పెంచిన ఆ తల్లికి లేదు కదా. కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అతను బయటకు వెళ్లి వచ్చిన వెంటనే చేతులు కడుక్కోకుండా ఆ బాటిల్ ని పట్టుకున్నాడు. ఆ బాటిల్‌ పట్టుకున్న తల్లికి  కరోనా సోకింది. తల్లి చనిపోయింది – కొడుకు బ్రతికాడు.

హృదయాల్ని మెలి తిప్పుతున్న ఈ విడియోను ఎంపీ సంతోష్‌కుమార్‌ తన ట్విటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసి ఆలోచించమంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news