చంద్రబాబు టార్గెట్ గా కుప్పంలో విజిలెన్స్ తనిఖీలు..?

-

మాజీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంపై విజిలెన్స్ శాఖ దృష్టి సారించిందా.. చంద్రబాబు హయాంలో ఈ నియోజక వర్గంలో జరిగిన అభివృద్ధి పనుల్లో కోట్లలో అవినీతి జరిగిందా.. ఇప్పుడు ఆ అవకతవకలు తేల్చే పనిలో విజిలెన్స్ దృష్టి సారించిందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది.

పలమనేరు, కుప్పం నియోజకవర్గాల పరిధిలో జరిగిన పనుల్లో అధికమొత్తానికి కాంట్రాక్టులు కట్టబెట్టి, ఖజానాకు వందల కోట్ల నష్టం తెచ్చారట. ప్రస్తుతం దీనిపై విజిలెన్సు అధికారులు, డిప్యూటీ ఇంజనీర్లు, జేఈలు తనిఖీలు చేసారు. కాల్వ పనులను పరిశీలించి నివేదక సిద్ధం చేస్తున్నారు. ఇందులో అవకతవకలు బయటపడితే బాబుకు ఇక్కట్లు తప్పవని వైకాపా నేతలు అంటున్నారు.

చంద్రబాబు హయాంలో టీడీపీ నేతలు కుప్పం కాల్వ పనులకు అంచనాలు పెంచి, అదనపు చెల్లింపులు చేశారని వైసీపీ కొన్ని రోజులుగా ఆరోపిస్తోంది. వారు చెబుతున్న వివరాలు ప్రకారం.. ఈపీసీ ద్వారా రూ.430.26 కోట్ల పనులు దక్కించుకున్న జాయింట్ వెంచర్ సంస్థలు 123.641 కిలోమీటర్ల కాలవ తవ్వకం పనులు చేయాల్సి ఉందట.

కానీ ఇంతవరకూ అవి పూర్తి కాలేదట. కాంట్రాక్టులో భాగంగా 324 స్ట్రక్చర్స్ 5 చోట్ల, ఎన్‌ హెచ్ క్రాసింగ్ పనులు 3 చోట్ల, ఎత్తిపోతల పథకాల నిర్మాణం చేయాలి. దీంతో 110 చెరువులకు నీరు అందించే పనులు 9 నెలల్లోగా పూర్తి చేయాలని కాంట్రాక్టులో ఉంది. అయితే ఆ పనులు ఇవాల్టీకీ పూర్తి కాలేదట.

Read more RELATED
Recommended to you

Latest news