ప‌వ‌న్‌పై విజయసాయి రెడ్డి ఘాటు విమర్శలు..

-

మాతృభాషను, మన నదులను రక్షించుకునేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ ‘మన నుడి-మన నది’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విష‌యం తెలిసిందే. దీనిలో భాగంగా ‘మన నుడి-మన నది’ అవశ్యకతను వివరిస్తూ ట్విట్టర్ లో ఆయన ట్విట్స్ చేస్తున్నారు. అయితే ఇది సినిమా టైటిల్ లా అదిరిపోయిందంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. ‘మన నుడి, మన నది.. సినిమా టైటిల్లాగా అదిరిపోయింది.

ముందు మీ నలుగురు పిల్లలను తెలుగు మీడియంలో చేర్పించి నుడికారాన్ని మొదలు పెట్టాలి. ఆ తర్వాత మీకు ప్యాకేజి ఇచ్చే యజమాని.. కృష్ణా నదిని పూడ్చి నిర్మించిన కరకట్ట నివాసాన్ని తొలగించాలని ఆందోళన చేయాలి. అప్పుడు నదుల రక్షణ సఫలమవుతుంది’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news