ప్రభాస్ రికార్డు బ్రేక్ చేసిన మహేష్‌..

-

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు మరోసారి సత్తా చాటాడు. మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ గురువారం నాడు విడుదలై టాప్ ట్రెండింగ్‌‌తో మిలియన్ల వ్యూస్ కొల్లగొడుతోంది. మహేష్ బాబు, అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇర రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ చిత్ర టీజర్ ను 18 మిలియన్లపైగా చూశారు. ఇప్పటి వరకూ ఇండస్ట్రీలో ఆల్ టైం రికార్డు సృష్టించింది. దక్షణ భారత చలన చిత్ర చరిత్రలోనే సరిలేరు నీకెవ్వరు సినిమా టీజర్ ను అత్యధికంగా కోటీ 80 లక్షల మంది వీక్షించారు. యూట్యూబ్‌ వ్యూవ్స్‌లో సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ఫస్ట్‌ ప్లేస్‌ మహేశ్ నిలిచారు.

సాహో చిత్రంతో ప్రభాస్‌ పేరున ఉన్న రికార్డును మహేశ్ బ్రేక్ చేశారు. సాహో టీజర్‌ రిలీజ్ చేసిన 24 గంటల్లో 17 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. తమిళ హీరో విజయ్ మూడో స్థానంలో ఉన్నారు. విజయ్ నటించిన సర్కార్‌ టీజర్‌ను 24 గంటల్లోనే 16 మిలియన్ల మంది చూశారు. నాలుగో చిత్రంగా మహేష్‌ నటించిన మహర్షి సినిమా నిలిచింది. అప్పట్లో ఈ చిత్ర టీజర్ రిలీజ్ అయిన 24 గంటల్లో 12.6 మిలియన్ల మంది వీక్షించారు. టాప్‌ 5లో రెండు స్థానాలు మహేశ్ కైవసం చేసుకోవ‌డం విశేషం. ఇక ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించారు.

Read more RELATED
Recommended to you

Latest news