మరోసారి రాజ్యసభ సీటుపై స్పందించిన విజయసాయిరెడ్డి

-

ఇటీవల వైపీసీ ఏపీ నుంచి రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే.. ఏపీలో 4 రాజ్యసభ స్థానాలకు వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం కావడం విధితమే. అయితే.. వారిలో మరోసారి విజయసాయిరెడ్డికి పెద్దల సభకు వెళ్లేందుకు అవకాశం దక్కింది. దీంతో.. ఆయన రెండో పర్యాయం రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. దీనిపై విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. వరుసగా రెండోసారి రాజ్యసభకు ఏకగ్రీవం కావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు విజయసాయి రెడ్డి.

RS polls: 4 YSRCP candidates elected unopposed

ఈ అవకాశం కల్పించిన సీఎం జగన్ కు, శ్రీమతి భారతమ్మకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు విజయసాయి వెల్లడించారు. ఇకముందు కూడా రాష్ట్రాభివృద్ధి కోసం అవిశ్రాంత కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నానని తెలిపారు. విజయసాయితో పాటు ఏపీ కోటాలో బీసీ నేత ఆర్.కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ రావు కూడా రాజ్యసభకు ఏకగ్రీవం అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news