బాబు పై విజయసాయి ట్వీట్.. చాలా ఘాటు..!

-

నిత్యం టీడీపీ అధినేత చంద్రబాబు పై విరుచుకుపడే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా మరో సారి విరుచుకుపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీటే రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. విశ్వాస ఘాతకుడిగా 25 ఏళ్లు పూర్తి చేసుకొని ఆగస్ట్ 25న ‘వెన్నుపోటు’ దినోత్సవం జరుపుకున్న బాబు.. ఆగస్ట్28 ‘చంద్రన్న రక్తపాత దినోత్సవం’ జరుపుకుంటున్నారు. బషీర్‌బాగ్‌లో బాబు సృస్టించిన మారణహోమం నేటికి 20 ఏళ్లు. నీవు ఎంత క్రూరుడివో, ఎంతటి విధ్వంసకారుడివో చరిత్రే చెబుతుంది బాబు. అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ విషయమై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అలాగే సోషల్ మీడియా వేదికగా కూడా టీడీపీ, వైసీపీ వర్గాలు తీవ్రంగా విమర్శలు చేసుకుంటున్నాయి. కాగా, ఆగస్టు 28 2000న తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో హైదరాబాద్‌ బషీర్‌బాగ్ లో రైతుల ఆందోళన చేస్తుండగా పోలీసులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news