అమెరికా వెళ్లి చదివాడా.. అన్ని భోగస్ డిగ్రీలే : లోకేష్ పై విజయసాయి సెటైర్లు

-

నారా లోకేష్ పదజాలం చూస్తే రాజకీయాలకు అర్హుడా…!? అమెరికా వెళ్లి ఎంబీఏ చదివాడా…!?.లేదంటే అవన్నీ బోగస్ డిగ్రీల అనే అనుమానం కలుగుతుందని నారా లోకేష్‌ పై సెటైర్‌ వేశారు వైసీపీ రాజ్య సభ సభ్యులు విజయ సాయిరెడ్డి. టీడీపీ,బీజేపీ నుంచి విజయసాయిరెడ్డి సమక్షంలో ముఖ్య నాయకులు వైసీపీలో చేరారు.

ఈ సందర్భంగా విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ…త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయి… వివిధ పదవుల్లో ఉన్న వాళ్ళు వస్తారు…టీడీపీ ఖాళీ అవ్వడం ఖాయమన్నారు. గతంలో దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని అభివృద్ధి వైసీపీతోనే సాధ్యమని తెలిపారు. అన్ని కులాలు, ఉప కులాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని… 2024నాటికి టీడీపీ ఖాళీ…ఆ పార్టీ అంతర్ధానం అయిపోతుంది..పెద్ద నాయకులు మాతో టచ్ లో వున్నారు..చర్చలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. పనితీరు ఆధారంగా అందరికీ సముచిత స్థానం ఇస్తామని.. లోకేష్ అనారిక ప్రవర్తన చూస్తే అయనకు ఎవరో తప్పుడు సలహా ఇస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. అసభ్యమైన భాషను ప్రజలు హర్షించరని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news