జగన్.. చంద్రబాబు మధ్య తేడా ఏంటో చెప్పిన విజయసాయి..!

-

జగన్మోహన్ రెడ్డి సర్కార్ గతంలో టిడిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పేరుమార్చి ప్రస్తుతం ప్రజలకు మాయమాటలు చెబుతున్నారని స్వతహాగా ఎలాంటి పథకాలను ప్రవేశ పెట్టలేదని గత కొన్ని రోజుల నుంచి ప్రతిపక్ష టిడిపి పార్టీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రతిపక్షాల విమర్శలు పై సోషల్ మీడియా వేదికగా స్పందించిన వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు విజయసాయిరెడ్డి.. చంద్రబాబు సహా టిడిపి నేతల అందరిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ విమర్శలు గుప్పించారు.

చంద్రబాబు తన కోసం తన వారి కోసం ఆరాట పడుతూ ఉంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రం… ప్రజల కోసం ఎన్నో కులాల కోసం మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు అంటూ విజయ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్ పోరాటం చేస్తుంటే చంద్రబాబు మాత్రం తన వారికోసం ఆరాటపడుతూనే ఉన్నారని జగన్ కి చంద్రబాబు కి మధ్య తేడా అదే అంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వ పథకాలకు పేరు మార్చారూ అంటూ విమర్శిస్తున్న టిడిపి తమ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన నాలుగు వెల్ఫేర్ స్కీం ల పేర్లు చెప్పగలరా అంటూ ప్రశ్నించారు వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news