ప్రకాశం జిల్లాలో కరోనా కలకలం.. రెండు జడ్పీ హైస్కూల్స్ పిల్లలకి !

-

ప్రకాశం జిల్లాలో కరోనా కలకలం రేగింది. ప్రకాశం జిల్లాలో రెండు జడ్పీ హైస్కూల్స్ లో చదువుతున్న విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ముండ్లమూరు మండలం మారెళ్ల జడ్పీ హైస్కూల్ లో ఎనిమిది మంది విద్యార్థులకు కరోనా సోకింది. అలానే కొత్తపట్నం మండలం గమళ్లపాలెం జడ్పీ హైస్కూల్ లో ఇద్దరు విద్యార్థులతో పాటు ఓ ఉపాధ్యాయునికి కరోనా పాజిటివ్ అని తేలింది. వీరికి ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉంచి చికిత్స పొందుతున్నారు.

ఇక ఈ విషయం తెలిసి విద్యార్థులను స్కూళ్లకు పంపించడానికి తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. స్కూళ్లలో కనీస ప్రమాణాలు పాటించటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే తరగతులు నిర్వహిస్తున్నామని ఉపాధ్యాయులు అంటున్నారు. నిజానికి వచ్చే నెల రెండు నుండి స్కూల్స్ ఓపెన్ చేయాలనీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ సముయంలో ఇలా వరుస కేసులు బయట పడడం సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news