పిడక కంటే ఆధ్వానం.. దేనికి పనికిరాడు : లోకేష్‌ పై విజయసాయి సెటైర్

-

పిడక కంటే ఆధ్వానం.. దేనికి పనికిరాడు అంటూ నారా లోకేష్‌ పై విజయసాయి రెడ్డి సెటైర్ వేశారు. నీతిలేని నాయకుడు ఎవరని అడిగితే భవిష్యత్తు తరాలు చంద్రబాబునే చూపిస్తాయని… అధికార దుర్వినియోగంతో ఆయన చేసినన్ని అరాచకాలు దేశంలో ఎవరూ చేసి ఉండరని ఆయన మండిపడ్డారు. చివరకు ఏకైక పుత్ర రత్నాన్ని మహిళలపట్ల గౌరవం లేని కుసంస్కారిని చేశారు. పిడకకూ ఒక ప్రయోజనం ఉంటుంది. పప్పు దానికి కూడా పనికిరాడు అంటూ ఓ రేంజ్‌ లో ఆడుకున్నారు విజయ సాయిరెడ్డి.

అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని.. విజయసాయిరెడ్డి వెల్లడించారు. మూడు రాజధానుల అభివృద్ధి కొనసాగుతుందని జగన్ గారు అసెంబ్లీలో చేసిన ప్రకటన పచ్చ బ్యాచ్‌ గుండెల్లో గునపంలా దిగి ఉంటుందని ఎద్దేవా చేశారు. పేల్చిన టపాసులు, పంచిన మిఠాయిల ఖర్చులు వేస్ట్‌ అయ్యాయి. ఒకే రాజధాని నినాదం అంతులేని వ్యథగా మిగిలిపోయినట్టేనని విజయసాయి రెడ్డి సెటైర్ వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news