టీఆర్ఎస్‌ పార్టీకి తెలంగాణ ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయం – విజయశాంతి

-

టీఆర్ఎస్‌ పార్టీకి తెలంగాణ ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయమని విజయశాంతి సంచలన వ్యాక్యలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుతో కొత్త నాటకాలు షురూ చేశాడని… పచ్చి అబద్ధాలు, మోసాలతో టీఆర్ఎస్ ప్లీనరీ కొనసాగిందని ఫైర్‌ అయ్యారు. కాళేశ్వరంలో వేల కోట్లు దోచుకుని త‌న కుటుంబ ఆస్తుల్ని లక్షల కోట్లకు పెంచుకున్నాడని… పార్టీ ఆస్తులతో పాటు తన కుటుంబ ఆస్తులు కూడా వెల్లడిస్తే బాగుండేదని నిప్పులు చెరిగారు.

రాష్ట్ర మంత్రులపై అవినీతి ఆరోపణలు ఉన్నయి. కోర్టు విచారణల్లో ఎప్పటికైనా తప్పక నిజం బయటకి వస్తుందని పేర్కొన్నారు. మళ్లీ ఆర్టీసీ చార్జీలు ఎందుకు పెంచుతున్నరు? అధికారులు నిబద్ధతతో పనిచేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్ ఎంఐఎంను నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతున్నాడని.. ఒక టీఆరెస్ ఎమ్మెల్సీ బాధ్యత గల సీఐని పట్టుకుని ప‌చ్చి బూతులు తిట్టాడని ఆగ్రహించారు.

పోలీసులంటే బానిసలనుకున్నారా ? రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసిన కేసీఆర్…తెలంగాణను నిండా ముంచేసి అప్పుల పాల్జేసిన కేసీఆర్ ఇక దేశాన్ని ముంచేందుకు కొత్త డ్రామాలాడుతున్నాడని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని అంటున్న కేసీఆర్… ఉద్యోగులకు విడతల వారీగా జీతాలు ఇచ్చే దుస్థితి ఎందుకొచ్చిందో… పెన్షనర్లకు బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి. కరెంటు చార్జీలు పెంచారని విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news