కెసిఆర్ ప్రభుత్వం పై విజయశాంతి వివాదాస్పద వ్యాఖ్యలు !

-

కెసిఆర్ ప్రభుత్వం పై బిజెపి నేత విజయశాంతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి వరద ముంపు గ్రామాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నయి. ప్రతి ఇంట్లో కనీసం ఇద్దరు… లేదంటే కుటుంబానికి కుటుంబమే మంచం పట్టారు. మలేరియా, డెంగీతోపాటు పెద్దసంఖ్యలో వైరల్ ​ఫీవర్ ​వ్యాప్తి చెందుతోందన్నారు.

అధికారికంగా ఇప్పటివరకు 7 వేల మంది వైరల్ ​ఫీవర్ బారిన పడినట్లు డాక్టర్లు చెప్తున్నరు. గోదావరి వరదలు తగ్గగానే శానిటేషన్​పేరిట కొంత హడావిడి చేసిన ఆఫీసర్లు ఆ తర్వాత పట్టించుకోలేదు. దీంతో భయపడ్డట్టే విషజ్వరాలు వణికిస్తున్నయి. వరదల తర్వాత అన్ని గ్రామాల్లోనూ పెట్టిన మెడికల్ ​క్యాంపులను కొద్దిరోజులకే ఎత్తేశారు. కొన్నిచోట్ల మెడికల్ క్యాంపులు నడుస్తున్నా కేవలం పారసిటమాల్​లాంటి ఒకటి, రెండు టాబ్లెట్లు మాత్రమే ఇస్తున్నారని మండిపడ్డారు.

వాటితో జ్వరం తగ్గకపోవడంతో బాధితులు సర్కారు ఆస్పత్రులు, పీహెచ్‌సీలకు క్యూ కడ్తున్నరు. అక్కడికికెళ్లినా తగ్గని కొందరు… అప్పులు చేసి మరీ ప్రైవేటు దవాఖానాలకు వెళ్తున్నరు. ఇంత జ‌రుగుతున్నా కేసీఆర్ స‌ర్కార్ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. ప్ర‌జ‌ల జీవితాల‌తో ఆడుకుంటున్న కేసీఆర్ స‌ర్కార్‌కు తెలంగాణ ప్ర‌జానీక‌మే త‌గిన బుద్ధి చెప్పడం ఖాయం అని హెచ్చరించారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news