SSMB 29 పై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చేసిన విజయేంద్ర ప్రసాద్..

-

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందని టాలీవుడ్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది ఇప్పటివరకు వీరి నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే తాజాగా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు.

 

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జక్కన తదుపరి సినిమాను సూపర్ స్టార్ మహేశ్ బాబు తో అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అనౌన్స్మెంట్ తర్వాత మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి గా ఉన్నారు. షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో అనే అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.. ఇప్పటికే జక్కన్న పలు వేదికలు, ఇంటర్వ్యూల్లో SSMB 29 పై స్పందిస్తూ హైప్ క్రియేట్ చేస్తుండగా అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది.. రాజమౌళి చిత్రాలకు ఎప్పటి నుంచో తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్న విషయం తెలిసిందే.. తాజాగా ఆయన సినిమా ప్రారంభంపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందిస్తూ.. ఈ సినిమాకు హీరోగా మహేశ్ బాబునే ఎందుకు ఎంచుకున్నారనే దానిపైనా క్లారిటీ ఇచ్చారు.

“ఎప్పటి నుంచో రాజమౌళి భారీ స్కేల్లో ఫారెస్ట్ అడ్వెంచర్ ఫిల్మ్ ను తెరకెక్కించాలని భావిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే టెక్నీకల్ టీమ్ నూ రెడీ చేసుకున్నారు. మహేశ్ బాబు ఇంటెన్స్ యాక్టర్ . యాక్షన్ సీన్స్ లో మహేశ్ అద్భుతంగా నటిస్తారు. ఇది కథను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు రైటర్స్ కు మంచి అవకాశం. ఎప్పుడు కావాలంటే అప్పుడు పాత్రలోకి వెళ్లి వచ్చే సామర్థ్యం మహేశ్ సొంతం. అందుకే రాజమౌళి ఆయన్ని ఎంచుకున్నాడు. ఇక సినిమాలోని పాత్ర కూడా సాహసాలు చేస్తూ అనేక దేశాలకు తీసుకెళ్లే విధంగా సాగుతుంది. షూటింగ్ ను వచ్చే ఏడాది మే లేదా జూన్ నెలలలో ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాం.. ” అని క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news