Viral Video : ఫీల్డింగ్ చేస్తూ చాక్లెట్ తింటున్న విరాట్ కోహ్లీ

-

అహ్మదాబాద్​ వేదికగా గురువారం రోజున ఇండియా​ ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్​ సిరీస్​ ఉత్కంఠంగా సాగింది. ప్రత్యర్ధులు తమ ఎత్తుగడలను ప్రదర్శిస్తుంటే.. టీమ్​ ఇండియా బౌలర్లు దానికి పై ఎత్తులు వేస్తూ వచ్చారు. అయినా కంగారు జట్లు టీమ్ ఇండియాను కంగారు పెట్టించడం ఆపలేదు. ఈ మ్యాచ్​కు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో పలు హైలైట్​ పాయింట్స్​తో పాటు మీమ్స్​ కూడా ట్రెండ్​ అవుతున్నాయి. అలా మాజీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ చేసిన ఓ పని ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.

సెకెండ్​ స్లిప్​లో టీమ్​ ఇండియా తరఫున విరాట్​ కోహ్లీ ఫీల్డింగ్​ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్కస్ లబుషేన్ స్ట్రైక్ తీసుకుంటున్న సమయంలో విరాట్​.. తన వద్దనున్న ఎనర్జీ బార్​ను ఆస్వాదిస్తూ కనిపించాడు. అయితే ఇది చూసి పక్కనే థర్డ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయాస్ అయ్యర్ అతనికి కొంచం ఇవ్వమని అడిగాడు. కాసేపు తర్వాత తన పాకెట్​లో ఉన్న ఆ చాక్లెట్​ను బయటికి తీసిన కోహ్లీ.. శ్రేయాస్ అయ్యర్‌కి విసిరాడు. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు సోషల్​ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news