ఆంధ్రప్రదేశ్: వినాయక నిమజ్జనం ఊరేగింపులో విధ్వంసం.. ఇంటికి నిప్పు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామంలో విధ్వంసం చెలరేగింది. వినాయక నిమజ్జనం ఊరేగింపులో విధ్వంసం సృష్టించారు. రెండు వర్గాలుగా చీలిపోయి రాళ్ళు, కర్రలతో దాడి చేసుకున్నారు. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఈ విధ్వంసం జరిగిందని తెలుస్తుంది. టీడీపీ వర్గీయుల ఇళ్ళపై వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు యుద్ధ వాతావరణాన్ని తలపించినట్లుగా సమాచారం.

వీధుల్లో మంటలు చెలరేగడం, ఇళ్ళపై మంటలు వేయడం సహా కర్రలు, రాళ్ళతో కొట్టుకోవడం సంభవించిందని వినిపిస్తుంది. దీంతో కొప్పర్రులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరిపై ఒకరు విద్వేషాలతో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తూ నానా రభస చేస్తున్నారు. దీంతో కొప్పర్రు ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. ప్రత్యేక బలగాలు వచ్చినట్లు తెలుస్తుంది. మరి ఈ  విధ్వంసంలో ఎంతమందికి గాయాలయ్యాయనేది ఇంతవరకు తెలియలేదు.

Read more RELATED
Recommended to you

Latest news