పల్నాడు జిల్లాకు చేరుకున్న మేమంతా సిద్ధం యాత్ర..

-

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘మేమంతా సిద్ధం’ యాత్ర ఈరోజు పల్నాడు జిల్లాలోకి ప్రవేశించింది. ఆదివారం రాత్రి వెంకటాచలంపల్లి ప్రాంతం వద్ద యాత్ర ఆగిన విషయం తెలిసిందే. నేడు అక్కడి నుంచి బొదనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డరోడ్డు వద్దకు చేరుకున్నారు. భోజన విరామం అనంతరం చీకటిగల పాలెం మూడింటికి వినుకొండ చేరుకున్నారు. ఈరోజు రాత్రి గంటావారిపాలెంలో ఆయన బస చేయనున్నారు.

ఇక, శివయ్య స్తూపం దగ్గర ప్రజలని ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు. అనంతరం శివయ్య స్తూపం నుంచి శావల్యాపురం మండలం గంటావారిపాలెం వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. రాత్రికి గంటా వారి పాలెంలో జగన్ బస చేసి ,రేపు ఉగాది వేడుకల్లో సీఎం జగన్ పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఈ రాత్రి నుంచి ఎల్లుండి ఉదయం వరకు గంట వారి పాలెంలోనే బస చేయనున్న నేపథ్యంలో భారీగా పోలీసులతో భద్రతా ఏర్పాటు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news