ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై ఫిర్యాదు చేసిందే మేము – పవన్ ఖేరా

-

ఢిల్లీ మద్యం కుంభకోణం పై ఫిర్యాదు చేసిందే మేమని అన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా. నేడు హైదరాబాద్ చేరుకున్న ఆయన.. శంషాబాద్ లో దిగగానే బీఆర్ఎస్ పోస్టర్లు కనిపిస్తున్నాయని.. బీఆర్ఎస్ లో ఇంకో మహిళ లేనట్టు కవిత ఒక్కరి ఫోటోనే కనిపిస్తుందన్నారు. కవితకి మహిళ సాధికారత గురించి ఇన్నాళ్ళకి గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు పవన్.

కాంగ్రెస్ పార్టీ పోరాటం వల్లే లిక్కర్ స్కాంలో కదలిక వచ్చిందన్నారు. లిక్కర్ స్కాంలో కాంగ్రెస్ మద్దతు ఎందుకు తెలుపుతుందని..? లిక్కర్ స్కాం పై ఫిర్యాదు చేసిందే మేమని అన్నారు. కవిత ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ లో మహిళల హక్కుల కోసం ఎన్నిసార్లు మాట్లాడిందని నిలదీశారు. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మారే క్రమంలో కావాల్సిన డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి? అంటూ నిలదీశారు.

సామాన్య ప్రజల నుండి డబ్బులు కొల్లగొట్టి బీఆర్ఎస్ పార్టీ కోసం వాడుకుంటుందని ఆరోపించారు. బీఆర్ఎస్ కుటుంబానికి వీఆర్ఎస్ ప్రకటించాలని పిలుపునిచ్చారు పవన్ ఖేరా. మా పోరాటం, ఒత్తిడి వల్లే సీబీఐ కవిత ఇంటికి వచ్చి విచారణ జరిపిందన్నారు. తెలంగాణ తప్పితే వేరే రాష్ట్రంలో ఒక్క సర్పంచ్ ని కూడా గెలిలించుకునే పరిస్థితి బిఆర్ఎస్ కి లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news