ప్రమాణ స్వీకారం తేదీని ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తాం : బొత్స సత్యనారాయణ

-

రాష్ట్రం అంతా ఫ్యాన్ గాలి బలంగా వీచిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడ్డామన్న ముఖ్యమంత్రి హామీలను ప్రజలు విశ్వసించారని తెలిపారు.మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆత్మగౌరవం కాపాడారన్న అభిమానం వైఎస్ జగన్ పై మహిళలలో పెరగడం వల్ల నిన్న ఎద్ద ఎత్తున ఓటింగ్ జరిగిందని,ఇది నూతన ఒరవడి అంటూ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ మోసాలు , కుయుక్తులు చేసిందని ఆయన ఆరోపించారు.

రాజకీయాల్లో చిత్తశుద్ధి ముఖ్యమని అన్నారు.విశాఖలో ప్రమాణ స్వీకారం తేదీని ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు బొత్స సత్యనారాయణ. జగన్‌ విశాఖలో ముఖ్యమంత్రి గా పండుగ లాంటి వాతావరణంలో ప్రమాణ స్వీకారం జరుగుతుందన్నారు. ఎన్నికల్లో కూటమి దిగజారిపోయిందని,కూటమి దౌర్జన్యాలకు పాల్పడితే మేం సంయమనం పాటించామన్నారు.వైసీపీ కార్యకర్తలు సహకరించడంతో మంచి పోలింగ్ జరిగిందని ,175కి 175 గెలుస్తామని.. ప్రజల నాడి తెలుసు కనుకే మా నాయకుడు ఆ నినాదం తీసుకున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news