మూడోసారి ఎన్డీఏ అధికారం చేపట్టబోతోంది: నరేంద్ర మోడీ

-

ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు ప్రధాని మోదీ. ‘ఎన్డీఏ కూటమికి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంగ్రామంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ గెలిచింది. మూడోసారి ఎన్డీఏ అధికారం చేపట్టబోతోంది. ఎన్నికల ఘట్టాన్ని విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల సంఘానికి అభినందనలు. జమ్మూకశ్మీర్ లో రికార్డ్ స్థాయిలో ఓటింగ్ జరిగింది. ఇది గర్వించదగ్గ విషయం’ అని మోదీ అన్నారు.

వివిధ రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయాలపై మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. ‘తెలంగాణలో మన నంబర్ డబుల్ అయింది. మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్,గుజరాత్, ఛత్తీస్ గఢ్, హిమాచల్ తదితర రాష్ట్రాల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేశాం. బీజేపీని ఆదరించిన ఆంధ్ర ప్రదేశ్ , ఒడిశా ప్రజలకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు అద్భుత ఫలితాలు సాధించారు. అరుణాచల్, ఆంధ్ర ప్రదేశ్ , ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాం’ అని మోదీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news