YSR సంక్షేమ పాలన ప్రతి గడపకు అందే వరకు పోరాడుతాం – వైఎస్ షర్మిల

-

తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడుతున్న ఏకైక పార్టీ వైయస్సార్ తెలంగాణ పార్టీ అని అన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. 2022వ సంవత్సరంలో అనేక సమస్యలపై పోరాడి వైయస్సార్ తెలంగాణ పార్టీ ప్రశ్నించే గొంతుకైందన్నారు. పాదయాత్రలోనూ అన్ని వర్గాల సమస్యలు, పాలకుల అవినీతి అక్రమాలపై ప్రశ్నించామని తెలిపారు. ఎన్ని నిర్బంధాలు సృష్టించినా, ఎన్ని కేసులు పెట్టినా ప్రజల తరుఫున పోరాడాం అన్నారు వైయస్ షర్మిల.

ఇక ముందు కూడా YSR తెలంగాణ పార్టీ ప్రజల పక్షమే అన్నారు. YSR సంక్షేమ పాలన ప్రతి గడపకూ అందే వరకు పోరాడుతాం అని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ తెలంగాణ పార్టీ విజయం సాధిస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news