వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి ప్రగతికి నాంది పలుకుతాం – చంద్రబాబు

-

ఇటీవల బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పిన సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ నేడు చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. మధ్యాహ్నం తన అనుచరులతో కలిసి మంగళగిరి టిడిపి పార్టీ కార్యాలయానికి తరలివచ్చి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనని పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. టిడిపిలోకి కన్నా లక్ష్మీనారాయణ రాక శుభపరిణామమని తెలిపారు. ఆయనని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థి దశ నుండి అంచలంచలుగా ఎదిగారని కొనియాడారు. కన్నాను పలు హోదాల్లో తాను చూసానని, ఎన్ఎస్ఈయూ నాయకుడిగా చేరి అంచలంచలుగా ఎదిగారని తెలిపారు. రాష్ట్ర రాజకీయాలలో కన్నాకు ఓ ప్రత్యేక స్థానం ఉందన్నారు. పదవులు ఎప్పుడు శాశ్వతం కాదని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి ప్రగతికి నాంది పలుకుతామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news