వెదర్ అలెర్ట్: తెలంగాణలో పెరుగనున్న చలి తీవ్రత..

-

తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా ఉష్టోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. రానున్న రోజుల్లో ఉష్టోగ్రతలు తగ్గి  చలి మరింతగా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడుతుందని తెలిపింది. ఈశాన్య భారతం నుంచి చల్లని గాలుు వీస్తుండటంతో రానున్న మూడు రోజులు చలి తీవ్రత పెరుగనుందని వాతావరణ శాఖ తెలిపింది. పగటి పూట సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. రాత్రి మాత్రం ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని తెలిపింది.

ఇప్పటికే తెలంగాణ జిల్లాల్లో చలి పెరిగింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతీ ఏటా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం కూడా ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి ఆదిలాబాద్‌లో 16.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈనెల 9,10 తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అప్పటి వరకు రాష్ట్రంలో చలి తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. చలి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news