సంచలన వార్త: 2027 కల్లా 8.3 కోట్ల మంది ఉద్యోగులు ఔట్ !

-

కొంతకాలం నుండి ప్రపంచ వ్యాప్తంగా మీరు సరిగా గమనిస్తే చాలా MNC కంపెనీలు తమ ఉద్యోగులను చాలా వరకు తగ్గించుకోవడానికి చూస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే లక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. తాజాగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం చేసిన ఒక సర్వే ఉద్యోగాలకు కునుకులేకుండా చేస్తోంది. ఈ ఫోరం దాదాపుగా 45 దేశాలలో ఉన్న 803 కంపెనీ లపై సర్వే చేసిందట. 2027 సంవత్సరం కల్లా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 8.3 కోట్ల మంది ఉద్యోగులపై వేటు పడే అవకాశం ఉందని సదరు సర్వే తెలిపింది.

ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ఆదరణ పెరుగుతుండడంతో ఈ పరిస్థితి దాపురించే ఛాన్సేస్ అధికంగా ఉన్నాయట. అందుకే ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు అంతా తమ కంపెనీ లో ది బెస్ట్ ఎంప్లాయ్ గా పనితీరును చూపించాలి. అప్పుడే కంపెనీ యాజమాన్యాలు వారిని తొలగించకుండా ఉంటారు. సరిగా పని చేయని వారిని మాత్రమే తీసి వేసి కొత్త వారిని తీసుకోవడానికి చూస్తున్నారు. మరి ఆ 8.3 కోట్ల మంది ఉద్యోగులలో మీ పేరు ఈ ఉండాలా వద్దా అన్నది పూర్తిగా మీ చేతుల్లో ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news