కొడుకుని జైలుకు పంపిన తల్లి వాట్సాప్ స్టేటస్

-

టెక్నాలజీ పెరిగాక ఎటువంటి నేరాలు చేసినా వెంటనే దొరికేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది. తల్లి వాట్సాప్‌ స్టేటస్‌ కొడుకును జైలు పాలు చేసింది. విషయం ఏంటంటే జూలై 12, 2019న సాయి ​కిరణ్‌ అనే వ్యక్తి గుడికి వెళ్లి తన ఇంటికి వచ్చేసరికి అతని ఇంటి తలుపులు బార్లా తెరచి ఉన్నాయి. అయితే తాళం వేయడం మర్చిపోయానేమో అనుకుని లోపలికి వెళ్లిన ఆ వ్యక్తి తన ఇంట్లో బంగారం దొంగిలించినట్లు గుర్తించాడు.

తన ఇంట్లో చోరి జరిగినట్లు పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశాడు. ఇక ఇన్ని రోజుల తరువాత వారి ఇంటి పక్కన ఉండే మహిళ కిరణ్‌ వాళ్ల ఇంట్లో పోయిన ఓ నగను పెట్టుకొని ఉన్న ఫోటోను వాట్సాప్‌ స్టేటస్ లో షేర్‌ చేసింది. ఇది చూసిన కిరణ్‌ అది తమ ఇంట్లో దొంగిలించినదేనని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేయగా ఆమె కొడుకు జితేందర్‌ ఈ దొంగతనానికి పాల్పడినట్లు తేలింది. కొడుకుని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ విషయం అతని తల్లి తెలిసే జరిగిందని పోలీసులు ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news