ఏపీలో ఐసెట్‌ , ఈసెట్‌ ఫలితాల రిలీజ్ ఎప్పుడంటే..?

-

ఏపీలో ఐసెట్‌ , ఈసెట్‌ ప్రవేశ పరీక్షల ఫలితాలను మే 30న ఒకే రోజు అధికారులు విడుదల చేయనున్నారు.ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆంధ్ర ప్రదేశ్ ఐసెట్‌-2024 ఫలితాలను సాయంత్రం 4గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ఐసెట్‌ కన్వీనర్‌ మురళీకృష్ణ తెలిపారు. మే 6న ఏపీలో 111, తెలంగాణలో 2 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించిగా మొత్తంగా 48,828 మంది దరఖాస్తు చేసుకోన్నారు. అందులో 44,446 మంది పరీక్షలకు హాజరయ్యారు.

పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్‌ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన ఏపీఈసెట్‌-2024 ఫలితాలను అనంతపురం- జేఎన్‌టీయూలో గురువారం ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ఈసెట్‌ ఛైర్మన్‌ శ్రీనివాసరావు, కన్వీనర్‌ భానుమూర్తి వెల్లడించారు. మే 8న AP ECET పరీక్షలు నిర్వహించగా.. రాష్ట్రవ్యాప్తంగా 36,369 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.

 

Read more RELATED
Recommended to you

Latest news