తెలంగాణలో అధికారం లోకి రాగానే వారిని జైలు కి పంపిస్తాం : రాజ్ నాథ్ సింగ్

-

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం.. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి లో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభకు రాజ్ నాథ్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని నెలకొల్పుతాం. పదేళ్లలో సీఎం కేసీఆర్ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చలేదు. 27 ఏళ్లుగా గుజరాత్ ను, దేశంలోనే ఒక మోడల్ గా అభివృద్ధి చేశామన్నారు.

తెలంగాణలో ఎందుకు అభివృద్ధి చేయలేదని కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నారా? బీజేపీ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయింది. బీజేపీ అధికారంలోకి రాగానే కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. వాజ్ పేయీ నుంచి మోడీ వరకు బీజేపీ ప్రభుత్వాలు, నాయకులపై ఒక్క అవినీతి మచ్చలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం మోసం చేసి పేపర్ లీకేజీలు చేసింది. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని ఏ ఒక్క దళితుడికి ఇవ్వలేదు అని రాజ్ నాథ్ సింగ్ విమర్శించారు. మేడ్చల్ బీజేపీ అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి, జిల్లా నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు సభకు హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news