ఏపీలో ప్రధాన పార్టీల మేనిఫెస్టో విడుదల ఎప్పుడు?

-

వచ్చేనెల మే 13 న ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా పార్టీలు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించాయి. ఇందులో భాగంగా ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పార్టీలన్నీ వ్యూహాలను రచిస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాలలో వైసీపీ , తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభలను కూడా ఏర్పాటు చేస్తున్నాయి.

ఈ సభలలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు.ఇదిలా ఉంటే… వైసీపీ, టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి మాత్రం మేనిఫెస్టో విడుదలపై మీనమేషాలు లెక్కిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలతో ప్రచారం చేసుకుంటున్నా.. ఉమ్మడి మేనిఫెస్టోపై ఇంకా కసరత్తు చేస్తున్నట్లు కూటమి వర్గాలు వెల్లడిస్తున్నాయి. వైసీపీ నుంచి ఇంకా ఎన్నికల హామీలు బయటకు రావట్లేదు. అమలు చేసేవి మాత్రమే మేనిఫెస్టోలో పెడతామని, త్వరలోనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news