వివేకా కుమార్తెనే టార్గెట్ ఎందుకు చేసారు…?

-

మాజీ మంత్రి… వైఎస్ వివేకానంద రెడ్డి హత్యా కేసుకు సంబంధించి సిబిఐ అనుసరిస్తున్న వ్యూహం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ హత్య కేసులో అసలు ఎప్పుడు ఎవరిని విచారిస్తున్నారో కూడా అసలు అర్ధం కావడం. వివేకా కుమార్తె సునీతను గత పది రోజుల నుంచి విచారిస్తునే ఉంది సిబిఐ. ఆమెను ప్రతీ రోజు విచారిస్తున్నారు. ఆమె నిన్న సాక్ష్యాలను కూడా సిబిఐ అధికారులకు ఇచ్చారు.

ఆమె ఏమిచ్చారు అనే దాని పై చాలా వారు ఇప్పుడు కొందరిలో ఆందోళన ఉంది. ఆమెను ఎందుకు ఇంత సేపు విచారించాల్సిన అవసరం ఉంది అనేది కూడా అర్ధం కావడం లేదు అసలు. ఆమెతో పాటుగా ఇంట్లో పని చేసే పని మనిషిని, వాచ్ మెన్ ని కూడా పదే పదే విచారిస్తున్నారు. త్వరలో ఏదోక సంచలనం ఈ కేసులో చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news