టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మతిపరుపు విషయంపై తాజాగా స్పందించారు రోహిత్ శర్మ. బీసీసీఐ నమన్ అవార్డుల కార్యక్రమం ముంబయిలో భారత స్టార్ క్రికెటర్లందరూ ఒకే చోట కనువిందు చేశారు. రోహిత్ను స్మృతి ఓ ప్రశ్న అడిగింది. మీకున్న హాబీల్లో దేనినైనా సహచర క్రికెటర్లు ఆటపట్టించారా? అని అడగ్గా దానికి స్పందిస్తూ.. నాకైతే తెలియదు.
కానీ మరిచి పోవడం గురించి మాత్రం టీజ్ చేస్తుంటారు. అది నా హాబీ కాదు అని సమాాధానం ఇచ్చాడు. మీరు ఇప్పటి వరకు ఏదైనా అతిపెద్ద విషయాన్ని మరిచిపోయారా ?’’ అని స్మృతి ప్రశ్నించింది. నేను ఆ విషయం చెప్పలేను. ఈ ప్రోగ్రామ్ లైవ్ లో వస్తే మా ఆవిడ చూస్తుంది. అని నవ్వుతూ వ్యాఖ్యానించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.
Don't 𝒇𝒐𝒓𝒈𝒆𝒕 to watch this 😎
Smriti Mandhana tries to find out the one hobby that Rohit Sharma has picked up recently, which his teammates tease him about 😃#NamanAwards | @ImRo45 | @mandhana_smriti pic.twitter.com/9xZomhnJjy
— BCCI (@BCCI) February 1, 2025