అడవి ఏనుగు బీభత్సం.. 15 రోజుల్లో ఏడుగురు బలి

-

చెట్టుని నరుకుతున్న ఓ వ్యక్తిని అడవి ఏనుగు బలి తీసుకుంది. పశ్చిమ బెంగాల్ లోని జార్ గ్రామ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

జిల్లాలోని బద్​గోరా పంచాయతీ పరిధిలోని కిస్మత్​ జంబేడా గ్రామంలో పరిమల్​ పాల్ తన కుటుంబంతో నివసిస్తున్నాడు. కట్టెలు కావాలని బుధవారం ఉదయం.. స్థానికంగా ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లాడు. చెట్లను నరుకుతున్న సమయంలో ఓ అడవిఏనుగు.. అతడిపై బలంగా దాడి చేసింది. అనంతరం తొక్కి చంపేసింది. బాధితుడికి ప్రతిఘటించే సమయం కూడా దొరకలేదని స్థానికులు చెబుతున్నారు.

విషయం తెలుసుకున్న అటవీ సిబ్బంది ఘటనాస్థలికి చేరారు. పోస్టుమార్టం నిమిత్తం అతడి మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తామని అటవీ అధికారులు హామీ ఇచ్చారు. అయితే జిల్లాలోని గత 15 రోజుల్లో అడవి ఏనుగుల దాడిలో ఏడుగురు మృతి చెందగా.. ఎనిమిది మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. అడవి ఏనుగుల నుంచి తమ ప్రాణాలు కాపాడాలని స్థానికులు అటవీ శాఖ అధికారులను కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news