అమిత్ షా అనుగ్రహం లేకుంటే జగన్ జైల్లోనే – సిపిఐ రామకృష్ణ

-

అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమం 1200 రోజులకు చేరిన సందర్భంగా వారి ఉద్యమానికి సంఘీభావం తెలిపారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. అమరావతి రైతు కూలీలు చేపట్టిన దీక్షలు 1200 రోజులకు చేరుకోవడంతో మంగళగిరిలోని వేములపల్లి శ్రీకృష్ణ భవన్ సిపిఐ కార్యాలయం నుండి మందండం గ్రామానికి రామకృష్ణ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలిపేందుకు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. జగన్ ఓ మూర్ఖపు ముఖ్యమంత్రి అని అభివర్ణించారు.

అమరావతి ఉద్యమాన్ని అణిచివేసేందుకు జగన్ ఎన్నో కుట్రలు చేశారని.. అయినా ఉద్యమం ఆగలేదని అన్నారు. రాజధాని అంశంలో సుప్రీంకోర్టుకు వెళ్లిన జగన్ కు ఊరట లభించడం లేదన్నారు. పోలీసుల అండలేకుండా అమరావతిలో జగన్ తిరగలేకపోతున్నారని చెప్పారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనుగ్రహం లేకుంటే జగన్ జైల్లోనే ఉంటారని.. ఆయన ఒక్క మాట చెబితే జగన్ కాదంటారా? అని ప్రశ్నించారు. బిజెపి నేతలు రాష్ట్రంలో జగన్ ను విమర్శిస్తూ ఢిల్లీలో మాత్రం వత్తాసు పలుకుతున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news