షర్మిలపై మహిళా పోలీసుల దాడి..తీవ్ర గాయాలు

-

 

తెలంగాణ వైసీపీ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల అరెస్టయ్యారు. వయా వైయస్ షర్మిల ఇవాళ టీఎస్పీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులతో టీఎస్పీఎస్సీ కార్యాలయానికి చేరుకున్న షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె అక్కడ రోడ్డుమీద బైఠాయించారు.

ఈ తరుణంలో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు… స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో టిఎస్పిఎస్సి కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇది ఇలా ఉండగా..ఈ సంఘటన నేపథ్యంలోనే షర్మిలకు స్వల్ప అస్వస్థత నెలకొంది. టీఎస్ పిఎస్సి వద్ద షర్మిల పై మహిళా పోలీసుల దాడి చేసినట్లు సమాచారం అందుతోంది. అరెస్ట్ చేసే సమయంలో విచక్షణ రహితంగా వ్యవహారించిన పోలీసులు…ఆమె పై దాడి చేశారట. దీంతో షర్మిలకు అంతర్గత గాయాలు అయినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news