BREAKING : కేబుల్ బ్రిడ్జి పై నుండి దుర్గం చెరువులో దూకి మహిళ ఆత్మహత్య

-

హైదరాబాద్‌ మహా నగరంలో మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. గచ్చిబౌలీ ప్రాంతానికి సమీపంలో ఉన్నటు వంటి కేబుల్ బ్రిడ్జి పై నుండి దుర్గం చెరువులో దూకి మహిళా ఆత్మహత్య చేసుకుంది. దీంతో దుర్గం చెరువులో దూకిన మహిళ మృతదేహాన్ని వెలికి తీశారు లేక్ పోలీసులు.

అనంతరం ఆ ఉస్మానియా మార్చురీ కి మృతదేహం తరలించారు పోలీసులు. మృతురాలికి 25 నుండి 30 సంవత్సరాల వయసున్నట్టు గుర్తించారు పోలీసులు. బంధువులు ఎవరైనా మాదాపూర్ పోలీసు స్టేషన్‌ లో సంప్రదించాలి అంటున్నారు పోలీసులు. ఇక ఆ మహిళ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నదనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news