ప్రియుడితో కలిసి వైజాగ్ వచ్చిన సాయిప్రియ

-

విశాఖ బీచ్‌లో అదృశ్యమైన వివాహిత సాయిప్రియ, ప్రియుడు రవితో కలిసి శుక్రవారం విశాఖలోని ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చింది. తాము పెళ్లి చేసుకున్నామని, కలిసి ఉంటామని.. తమకు ఎటువంటి హాని కలగకుండా చూడాలని వారు పోలీసులను కోరారు.

కేసు దర్యాప్తు చేస్తున్న మూడో పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆ జంట వివరాలను నమోదు చేసుకున్నారు. ఇరువైపులా తల్లిదండ్రులను పిలిచి మాట్లాడించారు. తమ బిడ్డలు చేసిన పనికి తలదించుకోవాల్సి వచ్చిందని, తాము వారిని ఇళ్లకు తీసుకువెళ్లబోమని వారు స్పష్టం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

దీంతో పోలీసులు రవి, సాయిప్రియలను స్టేషన్‌ నుంచి పంపించివేశారు. వారు వెళ్లిపోతున్న సమయంలో అక్కడికి మీడియా ప్రతినిధులు రావడంతో సాయిప్రియ సృహతప్పి పడిపోయింది. తల్లిదండ్రులతో కాకుండా తామిద్దరం కలిసి వేరుగా ఉంటామని మీడియాకు చెప్పి, వెళ్లిపోయారు.

అసలేం జరిగిందంటే… చిరిగిడి సాయిప్రియ, శ్రీనివాసరావు భార్యాభర్తలు. సాయి ప్రియ విశాఖ ఎన్‌ఏడీ సమీపంలోని సంజీవయ్యనగర్‌లో ఉంటుండగా.. భర్త హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈనెల 25వ తేదీ పెళ్లిరోజు కావడంతో అదే రోజు సాయంత్రం భార్యాభర్తలు ఆర్కేబీచ్‌కు వెళ్లారు. రాత్రి 7.30 గంటల సమయంలో తిరిగి వెళ్లిపోదామని అనుకుంటుండగా.. శ్రీనివాసరావుకు ఫోన్‌ రావడంతో పక్కకు వెళ్లి మాట్లాడి తిరిగి వచ్చేలోపు భార్య కనిపించలేదు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. మంగళవారం ఉదయం నుంచి స్పీడ్‌బోట్లు, నేవీ హెలికాప్టర్‌ ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి ఆమె తన ప్రియుడిని పెళ్లి చేసుకుని నెల్లూరులో ప్రత్యక్షమవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news