భర్తకు తెలియకుండా భార్య రెండో వివాహం.. అవి ఇవ్వకుండానే..!

-

విడాకులు ఇవ్వకుండానే భార్య రెండో పెళ్లి చేసుకొందని ఓ భర్త బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫస్ట్‌ లాన్సర్‌ ప్రాంతానికి చెందిన మహమ్మద్‌ సుల్తాన్‌కు 2013లో రుబీనా బేగంతో పెద్దల సమక్షంలో వివాహమైంది. ఆమె 2017లో ముబీనుద్దీన్‌ను రెండో వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, మహ్మదీయ చట్టాన్ని పాటించకుండా ఖులా (విడాకులు) ఇవ్వకుండానే ఆమె మరొకరిని వివాహం చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

రుబీనా బేగం వేధింపుల కింద తప్పుడు కేసు పెట్టినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, ఈ నేపథ్యంలోనే తాను లైంగిక సామర్థ్య పరీక్షలు సైతం చేయించుకొని ధ్రువపత్రం తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. భార్యతో పాటు ఆమె తల్లి, సోదరుడు తనపై పలుమార్లు దాడికి పాల్పడ్డారని, వారి నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో కోరారు. పోలీసులు రుబీనాబేగం, ఆమె తల్లి ముంతాజ్‌బేగంలతోపాటు కుటుంబ సభ్యులైన హైదర్‌ అలీ, యూసుఫ్‌పాషా, మహ్మద్‌ ఖాసీం, ముబీనుద్దీన్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news