ఆటో డ్రైవర్​తో ఆరుగురు పిల్లల తల్లి వివాహేతర సంబంధం.. పెళ్లికి ఒప్పుకోలేదని చున్నీతో..

-

ఆరుగులు పిల్లలున్న ఓ 30 ఏళ్ల మహిళ 26 ఏళ్ల ఆటో డ్రైవర్​తో ప్రేమలో పడింది. కొద్దిరోజులు ప్రేమలో మునిగితేలాక అతడిని పెళ్లి చేసుకోమని అడిగింది. దానికి అతడు ససేమిరా అన్నాడు. తనను కాదన్నాడన్న కోపంతో ఆ మహిళ డ్రైవర్​ను చున్నీతో ఉరేసి హత్య చేసింది. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబయిలో చోటుచేసుకుంది.

ముంబయిలోని పొవాయ్​ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల మహిళ తన ఆరుగురు పిల్లలతో నివాసం ఉంటోంది. అయితే అదే ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల ఆటో డ్రైవర్​తో ప్రేమలో పడింది. తనను వివాహం చేసుకోమని మహిళ యువకుడిపై ఒత్తిడి తెచ్చింది. అందుకు అతడు నిరాకరించాడు. అది తట్టుకోలేని మహిళ.. శనివారం ఇద్దరూ కలిపి ఆటోలో మార్కెట్​కు వెళ్తున్న సమయంలో తన చున్నీతో అతడి గొంతు నులిపి చంపేసింది. హత్య అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయింది.

వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైడింగ్ సీటులో అపస్మారక స్థితిలో పడి ఉన్న బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు

Read more RELATED
Recommended to you

Latest news