కుప్పకూలిన పబ్లిక్ టాయిలెట్.. అందులో మహిళ !

-

ముంబైలోని కుర్లా ప్రాంతంలో సోమవారం ఒక పబ్లిక్ టాయిలెట్ కుప్ప కూలింది. ఆ కుప్పకూలిన టాయిలెట్ లోపల చిక్కుకున్న ఒక మహిళను రక్షించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ సంఘటన సోమవారం తెల్లవారు జామున జరిగినట్టు చెబుతున్నారు. ఇక దీనికి సంబంధించి సహాయక చర్యలను ప్రారంభించడానికి అగ్నిమాపక దళం తమ బృందాన్ని రంగంలోకి దింపారు.

ఇక రక్షించిన వెంటనే, మహిళకు ప్రథమ చికిత్స చేసి, ఆస్పత్రికి పంపారు. అయితే దురదృష్టవశాత్తూ రక్షించిన మహిళ కన్నుమూసింది. మహిళ కాలు శిథిలాలలో చిక్కుకున్నట్లు చెబుతున్నారు. ఈ సంఘటన ఉదయం 7.40 గంటల సమయంలో కుర్లా-వెస్ట్‌లోని నాజ్ హోటల్ వెనుక జరిగింది, దీని తరువాత అగ్నిమాపక దళం, పోలీసులు మరియు పౌర సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆమె ఆసుపత్రిలో చేరినప్పటికీ గాయాలు తీవ్రంగా కావడంతో మరణించింది.  

Read more RELATED
Recommended to you

Latest news